భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 25 (ప్రజా జ్యోతి).///..మండలంలోని దేశముఖి గ్రామంలో ఉన్నా సెయింట్ మెరిస్ కళాశాలలో ఫార్మసీ విద్యార్థులు ఘనంగా అంతర్జాతీయ ఫార్మాసిస్ట్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమలు అవహుతులను అలరించాయి. అనంతరం ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని అలాగే కరోనా నియంత్రణలో ఫార్మసీ పాత్ర చాలా కీలకమైన పాత్ర అని ప్రపంచం మొత్తం ఫార్మాసిస్ట్ సేవలను గుర్తించాలని వారికి తగిన గౌరవం ఇవ్వాలని నినదించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఈఓ సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపల్ డాక్టర్ గౌతమ్, వైస్ ప్రిన్సిపాల్ జనార్దన్ నాయుడు ఎచ్.ఓ డి శ్వేతా అధ్యాపకులు విద్యార్థులు పేద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- 1 view