నిడమనూరు(నాగార్జున సాగర్ ),ఆగస్టు30(ప్రజాజ్యోతి):నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు తేరా చిన్నపరెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలకు సకల దేవగణాలకు అధిపతి, తొలిపూజ అందుకునే వినాయకస్వామి భాద్రపద మాసం చతుర్ధి రోజున జన్మించిన కారణంగా బుధవారం దేశ ప్రజలంతా వినాయక చవితి పండుగను జరుపుకుంటారు.
విఘ్నేశ్వర స్వామిని ప్రార్ధించడం వల్లన సకల ఆటంకాలు వైదొలగి సకల కార్యసిద్ధి సిద్ధించి ఆనందమయ జీవితం ప్రాప్తించాలని తేరా చిన్నపరెడ్డి కోరారు. విద్య, విజ్ఞానం, వినయ ప్రదాత వినాయకుడు.
విఘ్నాలను తొలగించి సకల అభిష్టాలను సిద్ధింపజేసే ఆదిపూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆ గణేషుని ఆశీస్సులతో రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని, కరోనాకష్టం తొలగిపోయి అంతటా సుఖసంతోషాలు నిండాలని ప్రార్ధించనున్నట్టు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇండ్లల్లో మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్టించుకోవాలని కోరారు. వినాయకచవితి సందర్భంగా నిర్వహించే నవరాత్రులను భక్తి, శ్రద్ధలతో నిర్వహించుకోవాలని నియోజకవర్గ ప్రజలను తేరా చిన్నపరెడ్డి కోరారు.