చౌటుప్పల్ సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి) .///.,టిఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు కంటికి రెప్పలాగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎల్లప్పుడు అండగా ఉంటాడని టిఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు నారెడ్డి అభినందన్ రెడ్డి అన్నారు.దామెర గ్రామానికి చెందిన ఊడుగు కృష్ణ అకాల మరణం చెందడంతో కృష్ణ కుటుంబానికి చేయూతనిస్తూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సహాయం గాను అందించిన 50 వేల రూపాయలను మృతుడు భార్య ధనలక్ష్మికి అభినందన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నా రెడ్డి అండాలు. నిమ్మల మమత, లక్ష్మమ్మ ,రజిత ,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, కరింగు సతీష్, నరసింహారెడ్డి శేఖర్ గౌడ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
- 3 views