హోరా హోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్

Submitted by kareem Md on Sat, 17/09/2022 - 11:18
The final match was hora hori

ఫోటో రైటప్: ఫైనల్ మ్యాచ్ గెలుపొందిన ఆకాంక్ష పాఠశాల.
హలియా,సెప్టెంబర్16(ప్రజా జ్యోతి):  
జాతీయ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మలిదశ ఉద్యమకారుల ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు గురువారం స్థానిక ఎమ్మెల్యే  నోమల భగత్ ప్రారంభించినారు.గత రెండు రోజుల నుంచి కొనసాగుతున్న ఆటల పోటీలు శుక్రవారం సాయంత్రం కబడ్డీ చివరి ఫైనల్ మ్యాచ్ హోరా హోరిగా కొన సాగినినది.అంతకుముందు ఆకాంక్ష పాఠశాల విద్యార్థులు తిరుమలగిరి,పెద్దవూర పాఠశాలల విద్యార్థుల పై జరిగిన కబడ్డీ పోటీలో విజయం సాధించి ఫైనల్ కి చేరుకున్నారు.సాయంత్రం జరిగిన ఫైనల్ మ్యాచ్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకాంక్ష ఉన్నత పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన చివరి మ్యాచ్ క్షణ క్షణం ఉత్కంఠ బరితంగా సాగి పలువురిని ఉత్కంఠ పరిచింది.చివరికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులపై ఆకాంక్ష ఉన్నత పాఠశాల విద్యార్థులు 01 పాయింట్ తేడాతో విజయం సాధించారు. విజయం సాధించిన విద్యార్థులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండా కృష్ణమూర్తి,కౌన్సిలర్ వర్ర వెంకట్ రెడ్డి,డోమ్నిక్,వడ్డే సతీష్ రెడ్డి, రావులపాటి ఎల్లయ్య, పిఈటీ లు ఎడవల్లి రాంబాబు,ఎల్లయ్య,ఆవుల చంద్రశేఖర్,పరమేష్, పలువురు శుభాభినందనలు తెలియజేశారు.