భువనగిరి, సెప్టెంబర్ 12 (ప్రజా జ్యోతి) ; భువనగిరి మండలం కేసారం గ్రామానికి చెందిన కాశపాక అనూష కు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్ చికిత్స పొందిన అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి పైళ్ల శేఖర్ రెడ్డి శాసనసభ్యులు సిఫారసు ద్వారా తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన 32,000 రూపాయల చెక్కును మరియు అదే గ్రామానికి చెందిన పోతుల ముత్యాలు 28,500, వట్టెం లావణ్య 28,000 రూపాయల చెక్కులు మంజూరు అయినవి. సోమవారం రోజున టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కమ్మగాని నర్సింహా తెరాస జిల్లా నాయకులు గౌరారం నరేష్ చేతుల మీదుగా బాధితులకు చెక్కులను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కమ్మగాని భాస్కర్ పోతుల. బిక్షపతి,పోతుల మల్లేష్,సూరువు సంపత్,అందెల మల్లేష్ , కాశ పాక ఎల్లేష్ ఈ దులకంటి సత్యనారాయణ, పోతుల రాంనర్సయ్య, అందెల స్వామి, రాగల్ల ఆంజనేయులు , కాశపాక ఎల్లేష్,కాశపాక నర్సింహా రావు , కమ్మగాని అంజయ్య, వట్టం నరేష్, కాశపాక సురేష్, పోతుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
- 1 view