ఆహార నియమాలు పాటించాలి

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:51
Diet rules should be followed

 చిట్యాల ప్రజా జ్యోతి సెప్టెంబర్ 19,../ మండలంలోని ముచ్చటపర్తి గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచి నందికొండ కవిత ఆధ్వర్యంలో అంగన్వాడి సూపర్వైజర్ జయప్రద మాట్లాడుతూ మహిళలలో కిషోర్ బాలికలలో పిల్లలలో పోషకాహార లోపాన్ని రక్తహీనతను తగ్గించుటకు తీసుకోవలసిన ఆహారం ఆరోగ్యం వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత త్రాగే మంచి నీరు ప్రాముఖ్యతల గూర్చి వివరించారు. పల్లె ప్రాంతాలలో దొరికే ఆకుకూరలు కూరగాయలు పండ్లు పాలు చిరుధాన్యాలను మొలకెత్తించిన గింజలను ప్రతిరోజు సమపాళ్లలో తీసుకున్నప్పుడు పోషకాహార లోపాన్ని తగ్గించి ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి మహేష్, అంగన్వాడీ టీచర్స్ తిరుపతమ్మ,త్రివేణి, కవిత,కనక లక్ష్మి,లావణ్య,హెల్త్  సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు