బుద్ధవనం సందర్శనానికి విద్యార్థులకు రాయితీ

Submitted by kareem Md on Sat, 03/09/2022 - 10:25
Concession for students to visit Buddhavanam
  •  ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్  బుద్ధవనం

నాగార్జునసాగర్,సెప్టెంబర్02(ప్రజా జ్యోతి) ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు బౌద్ధ క్షేత్రం బుద్ధవనం సందర్శనకు వచ్చే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి (శనివారం) వచ్చే విద్యార్థులకు 50 శాతం రాయితీ అమలు చేస్తున్నామని తెలిపారు. రేపటి నుంచి ఇది విద్యార్థులకు వర్తిస్తుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. విద్యార్థులతో పాటు వచ్చే తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ఈ రాయితి వర్తిస్తుందని తెలిపారు. విద్యార్థులు సందర్శనార్థం వచ్చేటప్పుడు ఆయా పాఠశాలల నుంచి ప్రధానోపాధ్యాయులు నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని తెలిపారు.