"దివిటీపల్లి డబుల్ బెడ్ రూమ్ లపై పూర్తి సమాచారం అందజేయాలి"

Submitted by Kramakanthreddy on Wed, 28/09/2022 - 13:27
"Complete information should be provided on Divitipally double bedroom rooms"

--డబల్ బెడ్ రూమ్ ల అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి
--మహబూబ్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 28 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  మహబూబ్ నగర్ అర్బన్ మండలంలోని దివిటిపల్లి గ్రామ శివారులో 1024 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారని, ఇందులో ఎంతమంది నిరుపేదలకు అధికారికంగా ఇల్లు అందజేశారని, ఇల్లు పొందిన వారి పట్టా సర్టిఫికెట్లు, ఇంకా ఎన్ని డబుల్ బెడ్ రూమ్ లు  పంపిణీ చేయకుండా ఉన్నాయని పూర్తి సమాచారాన్ని తెలియజేయాలని కోరుతూ మహబూబ్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జె చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం అర్బన్ తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డబుల్ బెడ్రూంల మంజూరులో  అక్రమాలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడం అభినందనీయమని తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ల అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో మహబూబ్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జె చంద్ర శేఖర్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కురువ నరేష్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ యాదవ్, పట్టణ ఉపాధ్యక్షులు లు సంజీవరెడ్డి, శేఖర్ యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు లు రమేష్ నాయక్, చంద్రమౌళి, పట్టణ ఆర్గనైజర్ సెక్రెటరీ మహమ్మద్ జాకీర్, యువజన కాంగ్రెస్ నాయకులు నరేష్ గౌడ్ , రమేష్ తదితరులు ఉన్నారు.