అలంపూర్: సెప్టెంబర్ 10(ప్రజా జ్యోతి) అలంపూర్ చోవరస్త ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాల పరిధిలోని గ్రామాల కు చెందిన 32 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుండి మంజూరు అయిన రూ.7,29,500/- లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేయడం జరిగినది
ఈ సదర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుంది ఆపదలో సీఎం సహాయ నీది ఆపద్భందువునిగ అదుకుంటుంది మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారు వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎనో కుటుంబాలకు ఈఫండ్ ఆసరాగా నిలుస్తుంది బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినిమెాగపర్చుకొవాలి అని ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కాశపోగు రాజు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంకల శీను గౌడ్ సోషల్ మీడియా కన్వీనర్ ప్రకాశ్ తనగల మహేంద్ర పచ్చర్ల రాజు రామాపురం నాయుడు సంజివ ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.