చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

Submitted by bathula ravikumar on Tue, 11/10/2022 - 21:39

చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

సూజాతనగర్ అక్టోబర్ 11 ప్రజాజ్యోతి. చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీస్ లు మంగళవారం అరెస్ట్ చేశారు.

మండలంలోని సర్వారం గ్రామపంచాయతీ నందు గల బోడగుట్ట సమీపంలోని నాయుడు నర్సరీ కు అనుకోని ఉన్న క్రషర్ మిల్లు వద్ద ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫారంలోని రాగి తీగలను దొంగలించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కొత్తగూడెంలోని మధుర బస్తికి చెందిన శివకుమార్ అనే వ్యక్తికి క్రషర్ మిల్లు కలిగి ఉంది అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ లో ఉన్న 5 కిలోల రాగి తీగను ఇనుప ప్లేట్ లను దొంగలించారు అది గమనించిన క్రషర్ మిల్లర్ యజమాని జటోత్ నాగేష్ ఘటోత్ నరసింహ వీరయ్య వ్యక్తులను పట్టుకొని స్థానిక పోలీసులకు పిర్యాదు చేయగా పోలీసులు విచారణ కేసు నమోదు చేసి నిందుతులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.