చౌటుప్పల్ సెప్టెంబర్ 26( ప్రజా జ్యోతి) సోమవారం ఉదయం రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరిన స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాగని కేతమ్మ , సాయంత్రం మునుగోడు కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సమక్షంలో తన సొంత గూటి అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కేతమ్మ మాట్లాడుతూ తనకు బలవంత పెట్టి బిజెపి పార్టీ కండువా కప్పరని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తాను మరి ఇతర పార్టీలో కొనసాగలేనన్నారు.
- 4 views