కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవనం ప్రారంభం

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 12:58
Inauguration of new building of Kasturiba Gandhi Girls Vidyalaya


పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి):  మండల కేంద్రంలో నూతనంగా  నిర్మించిన  కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం  నేడు  మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి  చేతుల మీదుగా  ప్రారంభించడం జరుగుతుందని ఎం ఈ ఓ నకిరేకంటి రవి ప్రకటనలో తెలిపారు.  ఈ సందర్బంగా   ఆయన మాట్లాడుతూ విద్యా శాఖ నిధులతో సుమారు 4కోట్లతో విద్యార్థులకు అన్ని  సౌకర్యాలతో  నిర్మించడం జరిగిందన్నారు   జిల్లా కలెక్టర్  ఆహ్వానం మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.