మాలోత్ రాందాస్ కు ఘన సన్మానం

Submitted by ThellasreenivasaRao on Tue, 27/09/2022 - 14:23

మాలోత్ రాందాస్ కు ఘన సన్మానం.

 కారేపల్లి, సెప్టెంబర్26 ప్రజాజ్యోతి:

 సింగరేణి మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయ పల్లి గ్రామంలో శ్రీ కోట మైసమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు మాలోతు రాందాస్ ను నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాలోతు రాందాస్ నాయకును తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా నియమించినందుకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు   పువాళ్ళ దుర్గాప్రసాద్ హాజరై నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు తలారి చంద్రప్రకాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు నేటి నుంచి ఒక సంవత్సరం కష్టపడాలి, రాబోయే రోజులు మనవి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పక వస్తుంది. అప్పటిదాకా పార్టీ కోసం పని చేయండి, కష్టపడి క్రమశిక్షణతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు తప్పక వాటంతటవే పదవులు వస్తాయి, ప్రతి కార్యకర్త సోషల్ మీడియాని వినియోగించుకోండి, కాంగ్రెస్ పార్టీ  పరిశ్రమలను స్థాపించింది, బ్యాంకులను జాతీయ చేసింది పేద ప్రజల కోసం రేషన్ షాపును ఏర్పాటు చేసింది, కులవృత్రులకు లోన్లు ఇచ్చింది, కాంగ్రెస్ కూడా పెట్టిన దేశ సంపదను నేడు బిజెపి పార్టీ దళారులైన అధాని, అంబానీలకు దారాదత్తం చేస్తుంది. నల్లధనాన్ని జాతికి అంకితం చేస్తానని చెప్పిన మోడీ ఈనాటి వరకు ఒక్కరికి ఇవ్వలేదని ఆరోపించారు. బిజెపి అధికారంలోకి వస్తే ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని, గంగానదిని ప్రక్షాళన చేస్తామని పేదల అభివృద్ధి కోసం పాటుపడిదామని ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలపై జిఎస్టి భారం మోపి మధ్యతరగతి కుటుంబాలు చితికి పోయే విధంగా పరిపాలన చేస్తుందని, ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్పక అధికారులకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ అధికారంలోకి వస్తే పెద్దకూలివాడిగా మీ అందరికీ పని చేస్తానని ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారం చేపట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలని పేరు మార్చి ప్రవేశపెట్టి ప్రజల నడ్డిపిస్తుందని ఆరోపించారు. దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిదని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి రాందాస్ నాయకత్వంలో  పనిచేసి ఈ నియోజకవర్గంలో మండలంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత రాందాస్ నాయక్ మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యత్వం ఇచ్చినందుకు జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ రావు కి రాష్ట్ర పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు, నాకు పదవి వచ్చిన రాకున్నా వైరా నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కష్టపడి పని చేస్తాను, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ వినోద్, సొసైటీ డైరెక్టర్ హీరాలాల్, మండల సీనియర్ నాయకుడు పాటి నర్సయ్య, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మేదరి వీర ప్రతాప్, జిల్లా నాయకులు గంగరాజు, మండల నాయకులు వీరు నాయక్, సేట్రం నాయక్ పాషా, రామ్ నాయక్,
 నాయక్ పాషా, రామ్ నాయక్, సట్టు వీరభద్రం, భాష, వాంకుడోత్ రాంబాబు,  బీముడు నాయక్, గాంధీ నాయక్, బాణోత్ కుమారి, మండల యువజన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.