స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 17 (ప్రజాజ్యోతి ):- తాటికొండ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా శనివారం గ్రామ సర్పంచ్ చల్లా ఉమసుధీర్ రెడ్డిలు డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ కి సర్దార్ సర్వాయి పాపన్న కి పూల మాల వేసి, జాతీయ జెండాను ఎగరవేశారు . అనంతరం గ్రామ ప్రజలకు 75వ తెలంగాణా జాతీయ సమైక్యత శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథిగా ఘనపూర్ స్టేషన్ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మారపాక రాములు, వార్డు సభ్యులు రొయ్యల కనకయ్య, బోయినీ ఎల్లయ్య, మారపాక పద్మనాగరాజు, చల్లా నరసింహారెడ్డి, దామేర ఉపేంద్రఎల్లయ్య, మహమ్మద్ గయాస్, బర్మా రాజయ్య, లావణ్యరమేష్, కో ఆప్షన్ సభ్యులు ఐలోని మల్లేషం , బేతి మంజుల, గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్, గ్రామ పెద్దలు, యూత్ నాయకులు, పార్టీ నాయకులు, పంచాయతీ కార్యదర్శి శేఖర్, అంగన్వాడీ టీచర్స్ ధనలక్ష్మి, పద్మ, అరుణ , సులోచన, మహిళా సంఘాల వి ఓ ఏ లు అక్కనపల్లీ సరిత, ఉమ్మగొని సుమతి, హై స్కూల్ హెడ్ మాస్టర్ రాజేందర్, టీచర్స్, స్కూల్ పిల్లలు, గ్రామ కారోబార్ మొహమ్మద్ సలీం, గ్రామ సిబ్బింది తదితరులు పాల్గొన్నారు.
- 1 view