కల్వకుర్తి,సెప్టెంబర్ 29( ప్రజాజ్యోతి).//.. వృద్ధుల పట్ల ప్రభుత్వానికి అమితమైన ప్రేమ ఉందని కల్వకుర్తిఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారుకల్వకుర్తి పట్టణంలోని ఎంపీడీవోకార్యాలయ ఆవరణలోని సమావేశమందిరంలో వృద్ధుల వారోత్సవాలను పురస్కరించుకొని వృద్ధుల హక్కులపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం , పోషణ మేళాకుఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జిల్లా సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి, ఎంపీపీ సామ మనోహర, మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యంహాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలిపారువృద్ధుల హక్కులను కాలరాస్తూ విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. పోషణ మేళాను పరిశీలించి, చిన్నారులకు అన్న ప్రాస ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నిర్వహించారు.అనంతరం పిబిఎస్ వృద్ధాశ్రమ నిర్వాహకులు పి వెంకటయ్య ను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జిల్లా సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి సత్కరించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ బాలయ్య , మాజీ వైస్ చైర్మన్ విజయ్ గౌడ్, ఎంపీడీవో ఆంజనేయులు, FRO పవన్ ఐసిడిఎస్ ,సూపర్వైజర్ పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
- 3 views