జాతీయ సాహస శిబిరానికి ఎంపికైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి.

Submitted by veerareddy on Sun, 25/09/2022 - 13:01
Government degree college student selected for National Adventure Camp.

అచ్చంపేట సెప్టెంబర్ 24 ప్రజా జ్యోతి.  బల్మూరు మండలంలోని కొండనాగుల ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న శివాని బిఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని జాతీయసాహాస శిబిరానికి ఎంపికైంది పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో పదిమంది విద్యార్థులు ఎంపిక కాగా అందులో శివాని కొండనాగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల చెందిన విద్యార్థిని ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రం ఎన్ హెచ్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు తరంగి రవి  వెంకటయ్య తెలిపారు నవంబర్ 15 నుంచి 24 వరకు హిమాచల్ ప్రదేశ్ లో జరిగే జాతీయ సహస శిబిరానికి విద్యార్థిని హాజరవుతున్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా శనివారం కళాశాలలో ప్రిన్సిపల్ అధ్యాపకులు ఆమెను సన్మానం చేశారు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల సూపర్డెంట్ నరసింహారావు అధ్యాపక బృందం పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్.విద్యార్థిని సన్మానిస్తున్న ప్రిన్సిపల్ అధ్యాపకులు.