పాఠశాల విద్యార్థులకు టేబుల్ మేట్ లు బహుకరణ

Submitted by bosusambashivaraju on Thu, 15/09/2022 - 12:25
Gift of table mates to school students

దేవరుప్పుల సెప్టెంబర్ 14,  ప్రజాజ్యోతి:- జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుద్దుల ప్రభాకర్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.వారి జ్ఞాపకార్ధంగా బుధవారం ప్రభాకర్ కూతుర్లు ప్రణీత, మౌనికలు కామారెడ్డిగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులకు 50 వేల రూపాయల విలువ గల టేబుల్ మేట్ లను బహుకరించారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై.శ్రీలత మరియు ఉపాధ్యాయులు వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో దుద్దుల పరుషరాములు, ఓడపెళ్లి రవీందర్, మహ్మద్ గులాం రసూల్, తదితరులు పాల్గొన్నారు.