గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఔదార్యం -మృతుని కుటుంబానికి రూ35 వేల ఆర్థికసహాయం

Submitted by venkat reddy on Fri, 23/09/2022 - 11:50
Generosity of Gram Panchayat Secretaries  - Financial assistance of Rs 35 thousand to the family of the deceased

నిడమనూరు,సెప్టెంబర్22 (ప్రజాజ్యోతి):  మాడ్గులపల్లి మండలం కన్నెకల్ గ్రామ పంచాయితీలో ట్రాక్టర్ డ్రైవర్ గా  గంటెకంపు నరేష్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల గంటెకంపు నరేష్ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందడంతో గురువారం నరేష్ కుటుంబాన్ని  మాడ్గులపల్లి మండల పంచాయితీ అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు పరామర్శించారు.అనంతరం చిన్న తనములోనే తండ్రిని కోల్పోయిన చిన్నారులకు మండల పంచాయితీ అధికారి,మండల పంచాయితీ కార్యదర్శులు సేకరించిన రూ .35వేలు ఆర్థిక సహాయాన్ని ఎంపిఓ రవికుమార్ చేతులమీదుగా చిన్నారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో  గ్రామపంచాయితీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు నాగేందర్,పంచాయితీ కార్యదర్శులు ప్రభాకర్, కోటిలింగం, నజీరోద్దీన్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.