- తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు
భువనగిరి, సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి) తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూపు 2, గ్రూప్ 3, గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సీఈవో ఐఏఎస్ అధికారి రఘురామ శర్మ తెలిపారని అర్హులైన బ్రాహ్మణ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పోచంపల్లి రమణారావు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వెబ్సైట్లో ఈనెల 15 నుండి 24వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఉచిత కోచింగ్ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఒక ప్రకటనలో తెలిపిందని దీనిని బ్రాహ్మణ నిరుద్యోగులు వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాలు కోసం 040-24754811 నెంబర్ సంప్రదించాలని పోచంపల్లి రమణారావు సూచించారు.