టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు ను బిజెపి పార్టీ లోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి

Submitted by mallesh on Sat, 24/09/2022 - 12:44
 Former MLA Raj Gopal Reddy invited TRS and Congress party ward members to BJP party.

చౌటుప్పల్ సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి) ..///. బిజెపి పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎనగంటి తండ  గ్రామానికి చెందిన కరెంటోత్ కళమ్మ, కరెంటోత్ నీలు నాయక్, కరెంటోత్ చందు కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు 20 మంది కార్యకర్తలను జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజగోపాల్ రెడ్డి బిజెపి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రిక్కల సుధాకర్ రెడ్డి, శీర్క రంగారెడ్డి, ఎంపీటీసీ జ్యోతి జంగయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.