నిడమనూరు, సెప్టెంబర్ 25(ప్రజాజ్యోతి): నిడమనూరు గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ బిసి రాష్ట్ర నాయకులు శేషరాజు బిక్షమయ్యకు ఇటీవల ప్రమాదవశాత్తు కాలువిరగడంతో చికిత్స నిమిత్తం నల్గొండ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయం తెలుసుకొని ఆదివారం మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి నిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి నిమ్స్ హాస్పటిల్ లో చికిత్స పొందుతున్న శేషరాజు బిక్షమయ్యను పరామర్శించారు.ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంగసాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిడమనూరు మండల అధ్యక్షుడు అంకతి సత్యం, నిడమనూరు సర్పంచ్ మేరెడ్డి పుష్పలత, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌని రాజా రమేష్ యాదవ్, ఉప సర్పంచ్ లక్ష్మీ నరేష్, శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.
- 3 views