హనుమకొండ, సెప్టెంబర్21 (ప్రజాజ్యోతి).../ వాహనదారులు తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సి వుంటుందని లేదంటే ట్రాఫిక్ జరిమానా నోటీస్ మీ ఇంటి తలుపు తడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహనదారులకు సూచించారు. ట్రై సిటి పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు, ట్రాఫిక్ క్రమబద్దీరణ చేస్తున్న పోలీసులకు తమ వంతు సహకారం అందించడం కోసం హనుమకొండలోని ఆజర హస్పటల్ యాజమాన్యం బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ కు మూడు ఫోటో కెమెరాలను అందజేసారు. ఈ సందర్భంగా తమ వంతు బాధ్యతగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ అవసరమయిన ఫోటో కెమెరాలను అందజేసినందుకుగాను పోలీస్ కమిషనర్ ముందుగా ఆజరహస్పటల్ యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కేవలం వాహనదారులకు జరిమానాలు విధించడం పోలీసుల లక్ష్యం కాదని ప్రతి వాహనదారుడు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే ట్రాఫిక్ పోలీసుల ప్రధాన లక్ష్యమని, ట్రాఫిక్ నిబంధనలను ప్రతి వాహనదారుడు తప్పక పాటించాలని, అలాగే నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు తప్పవని, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రజల సహకారం అవసరమని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ కార్యక్రమములో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అదనపు డిసిపి పుష్పా రెడ్డి, ట్రాఫిక్ ఎసిపి మధుసూదన్ రెడ్డి, హనుమకొండ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రవికుమార్, డాక్టర్ శివసుబ్రమణ్యం, డా. వెంకటేష్ తౌటి పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్