నాగారం ప్రజా జ్యోతి 28 సెప్టెంబర్,../// నాగారం మండల కేంద్రంలోని బంగ్లా ఎక్స్ రోడ్ లో మంగళవారం పిడుగుపాటుకు మృతి చెందిన గంగమ్మ కుటుంబాన్ని బుధవారం ఎం.పి.పి.కూర మణి వెంకన్న, వైస్ ఎంపీపీ మణిమాల పరామర్శించారు. ఆనంతరం మృతురాలి కుటుంబానికి వైస్ ఎంపీపీ మణి మాల ఎస్. ఫౌండేషన్ ద్వారా 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మణి వెంకన్న మాట్లాడుతూ... .. గంగమ్మ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటు అని అన్నారు. ఆ కుటుంబాన్ని భవిష్యత్తులో అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. అనతరం గంగమ్మ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శోభారాణి, నాగారం సర్పంచ్, చిప్పలపల్లి స్వప్న, ఉపసర్పంచ్ భద్రయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుండ గాని అంబయ్య గౌడ్ ,టిఆర్ఎస్ నాయకులు దోమల బాలమల్లు, సోమయ్య ,సత్తయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.
- 2 views