కొడకండ్ల (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 25 : మండలంలోని నరసింగాపురం గ్రామానికి చెందిన గోపాల్ దాస్ ప్రసాద్, గురుకుల పాఠశాలలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుండగా, విషయం తెలుసుకున్న 1990-91 వ సంవత్సరం 10వ తరగతి చదువుకున్న ప్రసాద్ సహ విద్యార్థులు ఆదివారం నరసింగాపురంలోని ప్రసాద్ ఇంటికి వెళ్లి పరామర్శించి, సహాయంగా 21 వేల రూపాయలను అందించారు. తోడుగా మేమున్నామంటూ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ మిత్రులు సలీం, సోమన్న, నిర్మల, దేషబోయిన సోమన్న, జ్యోతి, హేమలత, పర్షురాములు, శహీన, శోభ, చంద్ర శేఖర్, పద్మ, శ్యామ్ సుందర్, సర్వర్ పాషా, బుచెందర్, రవి, నేతి ఉపేందర్, నర్మెట ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
- 1 view