ఇటిక్యాలలో పిడుగుపాటుకు రైతు మృతి

Submitted by Mdrafiq on Sun, 04/09/2022 - 13:57
Farmer dies due to lightning in Itikya

జగిత్యాల క్రైమ్, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి) : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఆదివారం పిడుగు పాటుకు గురై రైతు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఇటిక్యాల గ్రామానికి చెందిన రైతు గడ్డం రాజిరెడ్డి (60) తన వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా వర్షంతో పాటు పిడుగు పడి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి నుండి పొలంకు వెళ్లి వస్తానని చెప్పి మృత్యువాత పడడంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. కాగా ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.