జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి... ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు..

Submitted by shaikmohammadrafi on Mon, 03/10/2022 - 14:43
Everyone should work hard to fulfill the ambition of Father of Nation Mahatma Gandhi...   MPP  Jyoti Madhubabu of Yatakula..

నడిగూడెం, అక్టోబర్ 2, ప్రజా జ్యోతి:  నడిగూడెంమండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం మండల పరిషత్ కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి ఎంపీపీ యాతాకుల  జ్యోతి మధుబాబు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అహింస మార్గంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన స్వాతంత్రాన్ని సాధించిన మహానీయుడు  జాతిపిత మహాత్మా గాంధీ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నడిగూడెం గ్రామపంచాయతీ తోపాటు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో  గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ  కార్యక్రమంలో పాల్గొన్న  వైసీపీ బడేటి వెంకటేశ్వర్లు, సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్, నడిగూడెం ఎంపీటీసీ గుండు శ్రీనివాస్, ఎంపీడీవో ఎం ఎర్రయ్య, ఎంపీఓ లింగారెడ్డి, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సూపరిండెంట్,ఇమామ్ జూనియర్ అసిస్టెంట్  శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శిలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..