కల్వకుర్తి సెప్టెంబర్ 14(ప్రజా జ్యోతి). ఉచిత వైద్య శిబిరాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వెంకటరమణ ఆసుపత్రి డాక్టర్లు వీరమళ్ళ శరత్,వీరమళ్ల రంజిత్,లు అన్నారు.బుధవారం యశోద ఆసుపత్రి సహకారంతో పట్టణంలోని వెంకటరమణ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా శిబిరంలో ప్రత్యేకంగా కిడ్నీ,మెదడు,పలు వ్యాధులపై యశోద ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్యులు సుధాకర్,భరత్ కుమార్, భాగ్యశ్రీ,ఫాతిమా,లు కిడ్నీ, మెదడు వ్యాధులకు సంబంధించిన పలు రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 230మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగిందని యశోద ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ నర్సింహం,నిర్వాహకుడు శ్రీధర్,లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటరమణ ఆసుపత్రి ఫిజియోథెరపీ డాక్టర్ నాగరాజు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
- 2 views