స్రవంతి రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

Submitted by mallesh on Mon, 19/09/2022 - 11:56
 Every activist should work like a soldier for the victory of Sravanti Reddy

చౌటుప్పల్ సెప్టెంబర్ 18 ప్రజా జ్యోతి..   కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి  గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఓ సైనికుల పని చేయాలని  సూర్యాపేట వరంగల్  జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న నాయిని రాజేందర్ రెడ్డిలు అన్నారు. ఆదివారం చౌటుప్పల మండలం స్వాములవారి లింగోటం గ్రామంలో నిర్వహించిన, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మునుగోడు గడ్డమీద కాంగ్రెస్ జెండా  ఎగరవేయడంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కీలకపాత్ర వహించాలన్నారు. స్రవంతి రెడ్డిని గెలిపించి టిఆర్ఎస్ బిజెపి పార్టీలకు బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ నాయకుడు భీమిడి ప్రదీప్ జి మాట్లాడుతూ  ప్రతి కార్యకర్త ఒక యుద్ధ విమానంలా పనిచేయాలన్నారు. మునుగోడు ఉపఎన్నికలో పాల్వాయి స్రవంతి ని అత్యధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజెప్పాలన్నారు. మునుగోడు గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరడం కోసం సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ బాతరాజు జ్యోతి లింగస్వామి, గ్రామ శాఖ అధ్యక్షులు పల్లపు వెంకటేష్, చేవెళ్లి శివకృష్ణ, యూత్ అధ్యక్షులు ఢిల్లీ నాగరాజు రెడ్డి, బాతరాజు నాగయ్య, కుర్నాల వెంకటేష్ కుర్నాల నర్సింహ, ఎర్ర విక్రమ్,  తదితరులు పాల్గొన్నారు.