అర్హులైన వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి

Submitted by Upender Bukka on Fri, 16/09/2022 - 11:47
A double bedroom house should be given to those who are eligible

నడిగూడెం, సెప్టెంబర్ 15 ,ప్రజాజ్యోతి: నడిగూడెం మండలం పరిధిలోని వేణుగోపాలపురం గ్రామములో  రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో అనేకమందికి అర్హులైన వారికి పింఛను రావట్లేదని ఆన్లైన్  ఓపెన్ చేసి అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మల్లెల వెంకన్న,రేఖ తిరపయ్య, కిన్నెర వెంకన్న  పిచ్చయ్య, మౌలానా, నాగ, తిరపయ్య, నజీర్, లింగరాజు, భరత్, రాంబాబు,  శ్రీకాంత్,  గోపాల్ తదితరులు పాల్గొన్నారు.