గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని సూచించిన జిల్లా కలెక్టర్

Submitted by Thirumal on Wed, 07/09/2022 - 16:44
The district collector suggested to provide proper nutritional food to pregnant women and infants

గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-   బుధవారం మల్దకల్ మండలం అమరవాయి, పాలవాయి గ్రామాలలో  అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేందుకు పోషణ మాసం ప్రభుత్వం నిర్వహిస్తున్నదని అన్నారు.  అమరవాయి గ్రామంలోని మూడవ అంగన్వాడి కేంద్రం పోషణ అభియాన్ కార్యక్రమంలో  పాల్గొన్నారు,

 ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పోషణ అభియాన్ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్నదని, ఇందులో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నదని తెలిపారు, అంగన్వాడీ సూపర్వైజర్లు కేంద్రాలను సందర్శించి లోటుపాట్లను సరిచేయాలని అన్నారు, గ్రామాలలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మహిళా సంఘాల సభ్యులు భాగస్వాములై నిర్వహించాలన్నారు,   గర్భిణీలకు బాలింతలకు తృణధాన్యాలు, ఆకుకూరలాంటి పౌష్టికాహారం అందజేయాలన్నారు, బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి సరైన పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమరవాయిలో తీవ్ర లోపం, అతి త్రీవ లోపం క్రింద గుర్తించిన  పిల్లలకు తప్పని సరిగా బాలామృతం ప్లస్ అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 ఈ విషయం పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం  ప్లస్  ఉదయం, సాయంత్రం, పిల్లలకు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, కంపచెట్లు ఉంటే తొలగించాలని సర్పంచులకు ఆదేశించారు, గర్భవతులు పండ్లు, ఆకుకూరలు  ఐరన్ ఉండే విదంగా  పౌష్టికాహారం తీసుకోవాలని, కాన్పుకు కాన్పుకు మధ్య కనీసం రెండు సంవత్సరాలు గ్యాప్ ఉండేలా చూసుకోవాలని గర్భవతులకు ఆదేశించారు, అంగన్వాడీ కేంద్రం ద్వారా అందజేసే సరుకులను గర్భవతుల ద్వారా  అడిగి తెలుసుకున్నారు సన్న బియ్యం రావడం లేదని, దొడ్డు బియ్యం వస్తున్నాయని వారు తెలిపారు, అనంతరం బిఎల్వోలతో మాట్లాడుతూ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం ఎంతమందిని చేశారని ప్రశ్నించారు, కలెక్టర్ ఒకవ్యక్తి ఆదార్ నెంబర్ తీసుకొని స్వయంగా ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ నెంబర్  అనుసంధానం చేశారు, అమరవాయిలో ఉన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను  తనిఖీ చేశారు, మధ్యహ్న భోజనాన్ని పరిశీలించి పిల్లలకు ఆకుకూరలు పెట్టాలని ప్రదానోపాద్యులకు ఆదేశించారు. 

తదనంతరం  పాలవాయి గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని, మరియు  ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు, పాఠశాలలో  కిచెన్ షెడ్ మరియు  మరుగుదొడ్లను పరిశీలించారు భోజనం చేయడానికి డైనింగ్ హాల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, భోజనం నాణ్యవంతంగా వండి పెట్టాలని వంట ఏజెన్సీ వారికి ఆదేశించారు ప్రాథమిక పాఠశాల ఆవరణ ముందు నీరు నిలువ ఉండడం చూసి ఆగిన నీటిలో దోమలు చేరతాయని, దోమల వల్ల పిల్లలకు  ఇబ్బందులు కలుగుతాయని, నీటి నిలువ ఉన్నచోట మొరం వేయించాలని కలెక్టర్ ఆదేశించారు, 
. పాలవాయి హెల్త్ సబ్ సెంటర్ పనులను కలెక్టర్ పరిశీలించారు  ఫ్లోరింగ్, టైయిలెట్స్, త్వరగా పనులు పూర్తి  చేయాలని  పంచాయతి అధికారులకు ఆదేశించారు, దౌదర్ పల్లి  సమీపంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు, పాఠశాలలో విద్యార్థినులకు సరైన భోజనం అందుతున్నదా, లేదా విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు, డైనింగ్ హాల్, కిచెన్, మరుగుదొడ్లు తదితర వసతులు ఉన్నాయా లేదా అని కలెక్టర్ పరిశీలించారు, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు, సొంత భవనం లేదని ప్రిన్సిపాల్ రేఖగౌతం కలెక్టర్ కు  వివరించారు, పిల్లలు  బాగా చదువుకొని ఉన్నత స్తాయి చేరుకోవాలని విద్యార్థులకు తెలిపారు. 

 ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ అధికారి  ముసాయిదా బేగం, పిఆర్ఈ సమత, సిడిపిఓ కమలాదేవి, సర్పంచులు పద్మమ్మ, శివరాం రెడ్డి, హెడ్మాస్టర్లు జానకి, విజయలక్ష్మి, శ్రీనివాసులు, సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు  తదితరులు పాల్గొన్నారు.


జిల్లా పార సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల చేజారి చేయబడినది