స్నేహిత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి

Submitted by sudhakar on Thu, 15/09/2022 - 10:52
District Collector Smt. Pamela Satpathy was the chief guest for the friendly program

అడ్డగుడూర్ సెప్టెంబర్ 14 (ప్రజాజ్యోతి  న్యూస్)స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాల లో జరిగిన స్నేహిత , బుధవారం బోధన , పోషన్ మాసం కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి , జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీ దీపక్ తివారీ  పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్నేహిత కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని , పిల్లలు వారి రక్షణ పట్ల జాగ్రత్త తీసుకుంటున్నారన్నారు. బుధవారం బోధన లో గట్టిగా చదవడం వల్ల పిల్లల్లో అభ్యసన పెరుగుతుందని అన్నారు.పోషణ మాసం లో భాగంగా పాఠశాల పోస్టర్ ను ఆవిష్కరించారు.అదనపు కలెక్టర్ శ్రీ దీపక్ తివారీ మాట్లాడుతూ స్నేహిత కార్యక్రమం ను జిల్లాల్లో అన్ని పాఠశాలలో విజయవంతంగా నిర్వహించారు అని అన్నారు.

అలాగే శ్రీ బైరెడ్డి పురుషోత్తం రెడ్డి, రవిల గార్ల జ్ఞాపకార్థం వారి కుమార్తె బీం రెడ్డి శైలజ - విద్యాసాగర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100 మందికి, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 32 మందికి హుడీస్ (చలి కోట్) లు వితరణ చేశారు. హుడీస్ ను జిల్లా కలెక్టర్  చేతుల మీదుగా విద్యార్దులకు అందజేశారు.కార్యక్రమం లో విద్యాశాఖ సెక్టోరల్ అధికారి శ్రీమతి నీరుడు ఆండాలు , యంపిపి దర్శనాల అంజయ్య, జట్పిటిసి శ్రీరాముల జ్యోతి అయ్యోధ్య, పి.ఎ.సీ.యస్. చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారి శ్రీ శ్రీధర్ , స్థానిక ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రహీమున్నిసా , ఉపాధ్యాయులు శివాజీ ,రవి, దామోదర్, రాములు, ఉష , కళ్యాణి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు , ఉపాద్యాయులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..