ప్రమాదవశాత్తు స్తంభం మీదపడి వ్యక్తి మృతి

Submitted by lenin guduru on Fri, 21/10/2022 - 12:02
నర్సయ్య

ప్రమాదవశాత్తు స్తంభం మీద పడి వ్యక్తి మృతి

బచ్చన్నపేట అక్టోబర్ 21 ప్రజాజ్యోతి:

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలో భారీ వర్షాలు,బలమైన గాలులు వీచడం వల్ల చెట్లు విరిగి స్తంభం పై ఉండడంతో వాటిని తొలగించడానికి వెళ్లిన బచ్చన్నపేట మండలకేంద్రానికి చెందిన గంధం నరసయ్య పై ప్రమాదవశాత్తు ఒక్కసారిగా స్తంభం మీద పడడంతో మృతి చెందాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బచ్చన్నపేట ఎస్సై నవీన్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తూ,మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.మొదటి పింఛన్ తీసుకున్న ఆనందం నెల రోజులు గడవలే.మృతుడు గంధం నరసయ్య కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మొదటి ఆసరా పింఛన్ ను తీసుకొనీ సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో గంధం నరసయ్య మృతితో విషాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న బచ్చన్నపేట సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, నాయకులు బాలకిషన్, సిద్ధారెడ్డి, గుర్రపు బాలరాజు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.