కాకునూరి మల్సూర్ గౌడ్ మృతి పార్టీకి తీరని లోటు పెన్పహాడ్ మండల ఎంపిపి నెమ్మది బిక్షం

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 08:59
 The death of Kakunuri Malsur Goud is a great loss for the party   Penpahad Mandal MPP Nemmadi Biksham


పెన్ పహాడ్ మండలం సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి): మండల పరిధిలోని తంగేళ్లగూడెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షుడు కాకునూరి నాగరాజు తండ్రి కాకునూరి మల్సూర్ గౌడ్  మంగళవారం తెల్లవారుజామున  మరణించగా, విషయాన్ని తెలుసుకున్న మండల ఎంపిపి నెమ్మది బిక్షం పార్టీ కార్యకర్తలు నాయకులతో వెళ్లి మృతుడికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోనే కాకుండా మండల స్థాయిలో టిఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు పని చేశారని మల్సూర్ గౌడ్ మృతి పార్టీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.   పరామర్శించిన వారిలో పిఏసిఎస్ చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి, ఎంపిటిసి జూలకంటి వెంకటరెడ్డి, టిఅర్ఎస్ రైతు విభాగం మండల అధ్యక్షుడు గుర్రం అమృతరెడ్డి, సర్పంచ్ బాధే ఈశ్వరమ్మధర్మయ్య, ఉపసర్పంచ్ దేశగాని శ్రీనివాస్ గౌడ్ , గ్రామశాఖ అధ్యక్షులు కుక్కడపు నరేష్ గౌడ్, కీర్తి వెంకట్రావు గౌడ్ , గౌడ సంఘం నాయకులు శోభన్ బాబు, నాగరాజు, సంతోష్, నవీన్, వెంకన్న, వెంకటేశ్వర్లు, పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామస్తులు తదితరులు పరామర్శించారు.