నాంపల్లి,సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి ): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ. తొమ్మిది లక్షలతో సిసి రోడ్ పనులు ప్రారంభించడం జరిగింది. నాంపల్లి మండలం దామెర గ్రామంలో స్థానిక సర్పంచ్ దామెర యాదగిరి బుధవారం నాడు సిసి రోడ్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి వీధి పరిశుభ్రంగా ఉండాలని గ్రామ అభివృద్ధి కొరకు ఒక సైనికుడిలా పనిచేస్తానని అన్నారు.ఇట్టి పనులు నాణ్యతతో కలిగి ఉండాలని వారు దగ్గరుండి రోడ్లు వేయిస్తున్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దామర ఉత్తరయ్య, ఏలందర్, కడారి పెద్దలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- 2 views