25-09-2022వరంగల్ జిల్లాప్రజాజ్యోతి\\\\. గ్రేటర్ వరంగల్ మహానగరంలోని తూర్పు నియోజకవర్గం పరిధిలోని దళితవాడలలో అత్యంత పేదరికం అనుభవిస్తున్న నిరుపేద దళిత కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి దళిత బంధు పథకాన్ని ఇవ్వాలని కోరుతూ
శనివారం ఉదయం వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారికి వారి నివాసంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ ఎమ్మెల్యే నన్నేపని కి సమస్యలు వివరిస్తూ మాట్లాడుతూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో గత ఏప్రిల్ మే నెల నుండి దళిత బంధుపై వాడవాడలోసర్వేలు నిర్వహించడం జరిగిందని అందులోఅత్యధికంగానిరుపేదలుఉన్నారని, వారికిదళితబంధుపథకంకావాలనికొంతమందిదరఖాస్తులరూపంలోజిల్లాకలెక్టరేట్లోకూడాఅందజేయడంజరిగిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ ఇవ్వనున్న వాటిల్లో నియోజకవర్గ పరిధిలోని దళిత నిరుపేదలకు ఇవ్వాలని కోరగఎమ్మెల్యే నన్నపనేని స్పందిస్తూ మాట్లాడుతూ తమ తూర్పు నియోజకవర్గ పరిధిలో నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వటం కోసమే పరిశీలన క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నామని తప్పకుండా దశలవారీగా అందరికీ కృషి చేస్తామని అన్నారు.
కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు ఆవుల ఉదయ్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఊసిల్ల కుమార్, జిల్లా కమిటీ సభ్యులు గొర్రె శేఖర్, ములుగురి రవి, కొంగర వరుణ్ కుమార్, రామంచ రాజు, దివ్య, మస్తాన్, రాజేష్ ,కందికట్ల సంజీవ తదితరులు పాల్గొన్నారు.ఆవుల ఉదయ్ కుమార్కెవిపిఎస్ ఖిలా వరంగల్ శివనగర్ ఏరియా కార్యదర్శి
- 5 views