దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు పథకం

Submitted by Ashok Kumar on Thu, 01/09/2022 - 14:17
Dalit Bandhu Scheme is for the development of Dalits

గద్వాల జిల్లా (ప్రజాజ్యోతి ప్రతినిది) ఆగస్టు 31 :  గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ధరూర్ మండలం పరిధిలోని గార్లపాడు    గ్రామానికి  చెందిన  శరణమ్మ దళిత బంధు లబ్ధిదారులకు  ఎంపికైన అయినా రూ. 10 లక్షల వ్యయంతో ట్రాక్టర్ వావానం ను  గద్వాల శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి  చేతుల మీదుగా తాళంచెవి లబ్ధిదారునికి  అందజేయడం జరిగినది.
ఎమ్మెల్యే కి లబ్ధిదారులు శాలువా కప్పి  ఘనంగా సత్కరించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూప్రపంచంలో ఏ ప్రధానమంత్రికి, ఏ ముఖ్యమంత్రి కి, రాని  ఆలోచన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కి రావడం జరిగింది. దళితులను కూడా ఆర్థికంగా ఎదగాలని,  దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి దళితులు ఆర్థికంగా ఎదగాలి దళితులు కూడా నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలని దళితులు గతంలో ఓట్లు వేసే యంత్రాలుగా ఉపయోగించుకున్నారు తప్ప, వారికి ఏమాత్రం కూడా ఇలాంటి ఆర్థిక సంబంధించిన పథకాలను గాని ప్రయోజనాలు గాని పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్  దళితుల కోసం ప్రత్యేకంగా దళిత బంధు, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితుల మహిళలకు కుట్టుమిషన్లు, కుటీర పరిశ్రమలకు సంబంధించిన పరికరాలను అందజేస్తూ వారికి అన్నివిధాలుగా అండగా నిలిచి దళితులు కూడా ఆత్మ ధైర్యంతో బతికేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్నివిధాలుగా అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్  అని అన్నారు.
భవిష్యత్తులో దళిత బంధు ద్వారా ప్రతి ఒక్క దళిత బిడ్డ అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్య రెడ్డి, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.