రాపెళ్లికోటలో కార్డెన్ సెర్చ్.

Submitted by veerareddy on Tue, 13/09/2022 - 12:38
 Cordon search in Rapellikot...

మావోయిస్టులకు ప్రజలు సహకరించవద్దు..ఎస్సై ఎన్ రాజ్ కుమార్.

మహాదేవపూర్ సెప్టెంబర్ 12 ప్రజాజ్యోతి  .  మహాదేవపూర్  మండలంలోని రాపల్లికోట గ్రామంలో ఏస్ ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేపట్టారు . ఇంటింటా తనిఖీలు నిర్వహించారు . అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి మావోయిస్టుల సమాచారం పోలీసులకు అందిస్తే వారిపై ఉన్న రివార్డులను సమాచారం అందించిన వారికి అందజేయడం జరుగుతుందని , మావోల సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆయన తెలిపారు . మావో ల కార్యకలాపాలకు సహరిస్తే సహించేదిలేదన్నారు . గుట్కా , గుడుంబా , ఇతర మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దని పిలుపునిచ్చారు. గ్రామంలో నేరాల నియంత్రణరు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన వెల్లడించారు . చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఏస్ ఐ ఎన్ రాజ్ కుమార్ హెచ్చరించారు . ఈకార్య క్రమంలో స్థానిక ప్రజలు  పాల్గోన్నారు.