మృతుడి కుటుంబానికి పరామర్శ

Submitted by sridhar on Mon, 05/09/2022 - 12:47
Condolences to the family of the deceased

మహాదేవపూర్ సెప్టెంబర్ 4 ప్రజా జ్యోతి ;మహాదేవపూర్ మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రెవెల్లి రాములు కుటుంభాన్ని జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్ ఫర్సన్  శ్రీ జక్కు శ్రీహర్షిణి-రాకేష్ పరామర్శించారు. యూత్ టౌన్ ప్రసిడెంట్ గా టీ ఆర్ ఎస్ పార్టీ కి సేవలు అందిస్తున్న రెవెల్లి రాజశేఖర్ ,తండ్రి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళి అర్పించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీపతిబాపు,టీ ఆర్ ఎస్ పార్టీ మహిళా విభాగం నియోజకవర్గ ఇంచార్జ్ కేదారి గీత,టీ ఆర్ ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు అలీం ఖాన్,టౌన్ ప్రసిడెంట్ కూరతోట రాకేష్,పార్టీ బీ సీ సెల్ మండల అధ్యక్షులు కారెంగుల బాపురావు,రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు బండం లక్ష్మారెడ్డి,సీనియర్ మండల నాయకులు చల్ల ఓదెలు,మెరుగు శేఖర్,లక్ష్మణ్,చింతకుంట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.