విద్యార్థుల స్థితిగతులు మెరుగుపరచాలి

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 10:33
The condition of students should be improved


పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 22(ప్రజా జ్యోతి):  మండల పరిధిలోని దుపహాడ్ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్, మండల నోడల్ ఆఫీసర్ వస్త్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థుల యొక్క స్థితిగతులను, విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పరిశీలించి విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల స్థితిగతులను మెరుగుపరచడానికి విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ పి నాగయ్య, ఆర్ పి విజయ్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు ఎం ఎస్ సరళ కుమారి, ఉపాధ్యాయులు ఎం కిరణ్ సింగ్ పాల్గొన్నారు