- మహబూబ్నగర్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు జాజెల చంద్రశేఖర్
మహబూబ్నగర్, సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి ప్రతినిధి) : 11-09-2022 ఆదివారం పాలమూరు యూనివర్సిటీ దగ్గర గల హైటెక్ ఫంక్షన్ హాల్ మహబూబ్నగర్ నందు తీన్మార్ మల్లన్న నిర్వహించిన 7,200 కార్యక్రమంలో భాగంగా జరిగిన గొడవలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు జాజెల చంద్రశేఖర్, జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కి ఫిర్యాదు చేశారు.
అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇటీవల ఆదివారం రోజు క్యూ న్యూస్ మల్లన్న ఏర్పాటు చేసిన సమావేశంలో జరిగిన గొడవలో మా కాంగ్రెస్ పార్టీనుద్దేశించి మహమ్మద్ పాషా అనే టిఆర్ఎస్ కార్యకర్త అసభ్య పదజాలంతో కాంగ్రెస్ పార్టీని దూషించారని, దానికి సంబంధించి అన్ని వీడియో ఆధారాలు పోలీసు వారికి సమర్పించి ఇట్టి దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ని విజ్ఞప్తి చేయడం జరిగిందని మహబూబ్నగర్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు జాజెల చంద్రశేఖర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సిరాజ్ కాద్రి,యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ యాదవ్, అసెంబ్లీ కార్యదర్శి శివ శంకర్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు సంజీవరెడ్డి, ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు నాగరాజ్, మండల ఉపాధ్యక్షుడు నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.