- 300 కార్ల తో భారీ ర్యాలీ
- విలేకరుల సమావేశంలో ఆహ్వాన కమిటి బాధ్యులు అప్జల్ హసన్, పులిపాటి ప్రసాద్, చిన్ని కృష్ణారావు, పొన్నం వెంకటేశ్వర్లు, కురువేళ్ళ ప్రవీణ్
ఖమ్మం ప్రతినిధి, సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి .రాష్ట్ర రవాణా శాఖా మంత్రిగా తన మూడు సంవత్సరాల పదవి కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని 4 సంవత్సరం లోకి అడుగుపెడుతున్న జిల్లా మంత్రి వర్యులు అజయ్ కుమార్ కి పౌర సన్మానం ఈనెల 18 ఆదివారం నిర్వహించనున్నట్లు వివిధ సంఘాల బాధ్యులు నిర్ణయించారు. ఈ సందర్భంగా గురువారం ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాను అభివృద్ధిలో అజయ్ కు ముందు అజయ్ తరువాత అన్నట్లుగా గత మూడు సంవత్సరాలలో అభివృద్ధిలో జిల్లా రూపు రేఖలు మార్చిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి రాజకీయేతర పక్షాలైన ప్రజా, పౌర , స్వచ్చంద, కుల, వృత్తి , వ్యాపార, ఉద్యోగ, ఉపాధ్యాయ , కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యం లో పౌర సన్మానం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గాంధీ చౌక్ కూడలి లో ఉదయం 11:30 గంటలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ భారీ కార్ల ర్యాలీ తో బయలు దేరి బ్రిడ్జి మీదుగా వైరా రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బైపాస్ రోడ్ సప్తపది ఫంక్షన్ హాల్ కు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటారని పులిపాటి ప్రసాద్, అప్జల్ హసన్, చిన్ని కృష్ణారావు తదితరులు లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
రాజకీయాలకు అతీతంగా జరిగే పౌర సన్మానంకు వివిధ సంఘాల బాధ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు కొప్పు నరేష్, జనరల్ సెక్రెటరీ గోడవర్తి శ్రీనివాసరావు, మిత్ర ఫౌండేషన్ ఛైర్మెన్ కురువేళ్ళ ప్రవీణ్ , గుమ్మడిల్లి శ్రీనివాస్ , గోళ్ళ రాధాకృష్ణ , అమరాగాని వెంకన్న , అల్లం పాటి వెంకటేశ్వెర్రెడ్డి , కిరాణా జాగిరి మార్చంట్స్ అసోసియేషన్ వేములపల్లి వెంకటేశ్వర్లు, టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్ సాగర్, టి జి ఓ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.