ప్రశాంత వాతావరణలో నిమజ్జనం జరుపుకోవాలి సీఐ రాజిరెడ్డి

Submitted by veerareddy on Wed, 07/09/2022 - 15:01
CI Rajireddy should celebrate immersion in peaceful atmosphere

భూపాలపల్లి సెప్టెంబర్6 ప్రజాజ్యోతి.  ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వినాయక మండపాల కమిటీ సభ్యులతో స్థానిక పోలీస్ స్టేషన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా సీఐ రాజిరెడ్డి వినాయక మండపాల కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని, మధ్యం సేవించి వాహనాలు నడపటం, గొడవలకు దిగడంలాంటివి చేయకూడదన్నారు. ఊరేగింపులో డీజేలు ఉపయోగించవద్దని, నిర్నీత సమయంలో నిమజ్జన ప్రాంతాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని పలు వినాయక మండపాల కమిటీ అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.