బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన - ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు

Submitted by veerareddy on Sat, 10/09/2022 - 10:48
Chief Minister's Relief Fund checks were handed over to the victims - MLA Dr. Gadari Kishore Kumar

తిరుమలగిరి సెప్టెంబర్ 8( ప్రజా జ్యోతి)  తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని  ఎమ్మెల్యే గారి నివాసంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 91 మంది లబ్ధిదారులకు ₹30,02,000/- లక్షల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన
తుంగతుర్తి శాసనసభ్యులుడా.గాదరి కిశోర్ కుమార్ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలా మారిందని ఎంతో మంది నిరుపేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి రిలీఫ్ ఫండ్ & LOC ల ద్వారా ఆర్థిక సహాయం అందుతోందని, వైద్యం చేయించుకునే ఆర్దిక స్తోమత లేని ప్రజలందరు సీఎం రిలీఫ్ ఫండ్ సేవలను వినియోగించుకోవాలని అన్నారు.ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం సహాయ నిధి ద్వారా తమకు అందించిన ఆర్దిక సహాయానికి బాధిత కుటుంబాలు ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ SA.రజాక్,ఎంపీపీలు, జెడ్పిటిసిలు,మండల పార్టీ అధ్యక్షులు మరియు గ్రామ సర్పంచ్లు,ఎంపీటీసీలు,ప్రజాప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు