విద్యుత్ బకాయిల పరిశీలన

Submitted by Degala shankar on Fri, 23/09/2022 - 12:28
Checking of electricity dues

లింగాపూర్ సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి) ..// విద్యుత్ సౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఈ శ్రీనివాస్ హెచ్చరించారు. విద్యుత్ ఏడిఈ శ్రీనివాస్ గురువారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ మండలంలోని  చుట్టుపక్కల గ్రామాలలో విద్యుత్ అధికారులు ఇంటింటి కి తిరుగుతూ విద్యుత్ స్తంభాలను, అక్రమ కనెక్షన్లు, బకాయి బిల్లులను పరిశీ లించారని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు  వంద యూనిట్ ల వరకు మాత్రమే ఉచిత విద్యుత్ సరఫరా ఉంటుందని, దానిలో భాగంగా మీటరు లేని ఎస్సీ, ఎస్టీ ప్రజలకు బకాయిలు ఉన్న  వారికి వారి విద్యుత్ కనెక్షన్ తొలగించడం జరిగిందని తెలిపారు.