డిగ్రీ కళాశాల విద్యార్థులకు బస్ సౌకర్యం కల్పించాలి....

Submitted by veerareddy on Wed, 07/09/2022 - 14:57
Bus for degree college students Provide facility

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయికుమార్.

మహాదేవపూర్ సెప్టెంబర్ 6 ప్రజాజ్యోతి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్  ఏబీవీపీ మహాదేవపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో   జూనియర్ మరియు డిగ్రీ కలశాల విద్యార్థులు బస్ సౌకర్యం కోసం అలాగే మౌలిక వసతులు కల్పించాలని ధర్నా  కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగుల సాయికుమార్ .మాట్లాడుతూ మహదేవపూర్ లో కి చుట్టూ పక్కల గ్రామాల నుంచి అనేక మంది  విద్యార్థులు వస్తున్నారు అని కానీ బస్ సౌకర్యం లేని కారణం గా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు,విద్యార్థుల కళాశాల సమయానికి అనుగుణంగా కాలేశ్వరం టు మహాదేవపూర్  అంబటిపెళ్లి  టు మహాదేవపూర్ ఈ మార్గం లో బస్ సౌకర్యం కల్పించాలని భూపాలపల్లి డిపో మేనేజర్ ని కోరడం జరిగింది.అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి సందీప్ ,కృష్ణ , వెంకటేష్, సాయి, సంజయ్, రాహుల్,  వనిత ,సింధు ,మానస పాల్గొన్నారు.