స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 28 ( ప్రజాజ్యోతి ) : - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో భాగంగా తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మంజూరు సాధ్యం కాదు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు నిరసనగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. బుధవారం గాంధీ సెంటర్ వద్ద టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని, దానిని విస్మరించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి మంజూరి లేదని వ్యాఖ్యానించడం వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చెయ్యాలని ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీపీ, అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
- 5 views