ఎమ్మెల్యే కృషితో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం... ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు..

Submitted by shaikmohammadrafi on Sat, 24/09/2022 - 12:20
 BT road construction work started with the efforts of MLA...  MPP Yatakula Jyoti Madhubabu..

నడిగూడెం, సెప్టెంబర్ 23, ప్రజా జ్యోతి:  నడిగూడెం నుండి రత్నవరం  వరకు చేపట్టిన బీటి రోడ్డు పనులు  శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కృషితో మంజూరైనట్లు పనులను యుద్ధ యుద్ధ ప్రాతి పథకన ప్రారంభించడం చాలా సంతోషకరమని. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా మండలంలోని అనేక గ్రామాల నుండి మండల కేంద్రానికి రాకపోకలు సులభతరం కాలున్నాయి అని ఎంపీపీ యాతాకుల  జ్యోతి మధుబాబు అన్నారు. శుక్రవారం  ఆర్ అండ్ బి ఏ ఈ సత్యనారాయణ తో కలిసి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ పనులు నిబంధనల కనుగుణంగా నాణ్యతగా చేపట్టాలని సూచించారు. గత 20 సంవత్సరాలుగా ఈ రోడ్డు మరమ్మత్తులకు  నోచుకోక పోవడం మూలంగా  చుట్టుపక్కల అనేక  గ్రామాల ప్రజలు ఈ  రోడ్డున ప్రయాణించాలంటే ఎంతో ఇబ్బందులు గురి అయ్యేవారని తెలిపారు.ఈ  రోడ్డు నిర్మాణం ద్వారా నడిగూడెం నుండి శాంతినగర్  వరకు రహదారి పూర్తి కావటం తో ప్రయాణికుల  ఇబ్బందులు తొలగను న్నట్లు తెలిపారు..