నడిగూడెం, సెప్టెంబర్ 23, ప్రజా జ్యోతి: నడిగూడెం నుండి రత్నవరం వరకు చేపట్టిన బీటి రోడ్డు పనులు శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కృషితో మంజూరైనట్లు పనులను యుద్ధ యుద్ధ ప్రాతి పథకన ప్రారంభించడం చాలా సంతోషకరమని. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా మండలంలోని అనేక గ్రామాల నుండి మండల కేంద్రానికి రాకపోకలు సులభతరం కాలున్నాయి అని ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు అన్నారు. శుక్రవారం ఆర్ అండ్ బి ఏ ఈ సత్యనారాయణ తో కలిసి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ పనులు నిబంధనల కనుగుణంగా నాణ్యతగా చేపట్టాలని సూచించారు. గత 20 సంవత్సరాలుగా ఈ రోడ్డు మరమ్మత్తులకు నోచుకోక పోవడం మూలంగా చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలు ఈ రోడ్డున ప్రయాణించాలంటే ఎంతో ఇబ్బందులు గురి అయ్యేవారని తెలిపారు.ఈ రోడ్డు నిర్మాణం ద్వారా నడిగూడెం నుండి శాంతినగర్ వరకు రహదారి పూర్తి కావటం తో ప్రయాణికుల ఇబ్బందులు తొలగను న్నట్లు తెలిపారు..
- 2 views