మునుగోడు ప్రచారంలో పాల్గొన్న దేవరుప్పుల నాయకులు

Submitted by lenin guduru on Sun, 23/10/2022 - 16:59
బీఆర్ఎస్

మునుగోడు ప్రచారంలో పాల్గొన్న దేవరుప్పుల నాయకులు

దేవరుప్పుల అక్టోబర్ 23(ప్రజాజ్యోతి) :-
జనగామ జిల్లా దేవరుప్పుల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం మునుగోడు నియోజకవర్గం చండుర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటి ఇంటి కి తిరుగుతూ ప్రచారం చేశారు. కార్యక్రమంలో జనగామ జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, జెడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రామ్ రెడ్డి, మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, బొబ్బాల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.