ఛలో పెద్ద అంబర్ పేట కు తరలివెళ్లిన బీజేపీ శ్రేణులు

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:33
BJP ranks moved to Chalo Pedda Amber Peta


తొర్రూరు సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి)..///...  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేపట్టిన నాలుగో విడత పాదయాత్ర-ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ చలో పెద్ద అంబర్ పేట బహిరంగ సభ కు తొర్రూరు మండలం నుండి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరిగింది.బీజేపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య జెండా ఊపి వాహనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసిఆర్ సర్కారు నియంత్రృత్వ నిరంకుశ అహంకార పాలనకు చరమగీతం పాడి రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టారు అని తెలిపారు.పాదయాత్ర కు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు.ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రభుత్వం ముందు ఏకరువు పెడుతూ ప్రజలకు భరోసా కల్పి.స్తూ కేసీఆర్ సర్కారు ఇచ్చిన హామీలను, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పాదయాత్ర చేస్తున్నారు అని తెలిపారు.ప్రదాని నరేంద్ర మోడీ గారు పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ పథకాలను ప్రజలు ఉపయోగించుకునే విధంగా ప్రజలకు వివరించి ప్రజలను బీజేపీ వైపు ఆకర్షించి రాష్ట్రంలో కమలం జెండా ఎగురవేసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఈ పాదయాత్ర కొనసాగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి పరుపాటి రాం మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు పూసాల శ్రీమాన్,  రూరల్ మండలం అధ్యక్షుడు బొచ్చు సురేష్,మంగళపళ్ళి యాకయ్య, పైండ్ల రాజేష్, కొమ్ము రాము,కొండ యాకన్న,వినయ్ కుమార్ శర్మ, నూకల నవీన్, గంధం రాజు, రాజ్కుమార్,సాయి,ఉదయ్, సిద్దు, జీవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.