- రాజగోపాల్ రెడ్డి ని గెలిపించుకోవాలి
- బిజెపి మండల కమిటీ అధ్యక్షుడు విక్రమ్
సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 5, ప్రజా జ్యోతి: మునుగోడు ఉప ఎన్ని కల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిపించుకోవాలని బిజెపి మండల కమిటీ అధ్యక్షుడు జక్కలి విక్రం కోరారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సోమవారం నా డు బిజెపి పార్టీ కొత్త ,పాత నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొత్త పాత నాయకులను ఎలా సమన్వయం చేసుకోవాలో వివరించారు . పార్టీ విధానాలను నూతన నాయకులకు తెలిపారు. మునుగోడులో పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించుకోవడానికి సమన్వయంతో ముందుకు సాగా లని సూచించారు.
మండల వ్యాప్తంగా బిజెపిని పటిష్టం చేయడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలిపారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీను నాయక్, బిక్షపతి నాయక్ ,బచ్చనగోని దేవేందర్ యాదవ్, ఉప్పల లింగస్వామి ,భాస్కర నరసింహం, కొండ్రెడ్డి నరసింహ, వంగరి రఘు, దాసోజు వెంకటాచారి ,గొల్లూరి యాదగిరి ,శేఖర్ రెడ్డి ,ఆత్కూరి రాములు, రాజు గౌడ్ ,నందగిరి జగత్ ,బద్దంగిరి ,ఉప్పర గోరిరాజు ,జక్కర తి బిక్షం, తదితరులు పాల్గొన్నారు.
- 1 view